వచ్చినవాడు ఫల్గునుడు"

"
వచ్చినవాడు ఫల్గునుడు"

మనసుకు నచ్చిన మహాభారత పద్యం.!

(తిక్కన్న గారి పద్యం.)

.

వచ్చినవాడు ఫల్గునుడు , అవశ్యము గెల్తుమనంగ రాదు , రా

లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే ?

హెచ్చేగుంగుందగున్ దొడరుతెల్ల విధంబుల కోర్చు టట్లుగా

కిచ్చ దలంచి యొక్కమెయి నిత్తరి బొందగు చేతయున్ దగున్

.

మహాభారత విరాట పర్వం లోనిదీ పద్యం . 

ఉత్తర గోగ్రహణాన్ని నిలువరించడానికి గాండీవాన్ని పూరిస్తూ , అర్జునుడు , 

కౌరవ సేనకు అడ్డంపడ్డాడు . 

.

కురుపితామహుడైన భీష్ముడు ఆ సందర్భంలో దుర్యోధనునితో చెప్పిన పద్యమిది .

.

” వచ్చిన వాడు అర్జునుడు . యుధ్ధంచేస్తే మనమే గెలుస్తామని వక్కాణించి చెప్పలేము . యుధ్ధంలో రెండుపక్షాలూ గెలవలేవు కదా . జయాపజయాలకు మనం సిధ్ధంగా ఉండాలి . దేనికైనా ఓర్చుకోవాలి . ఈ సమయంలో సంధి చేసుకోవడం కూడా సరియైనదే” .

అనుభవంతో పండిపోయిన వారి ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి . అర్జునుడితో యుధ్ధం అంత సులభం కాదనే భావన వ్యక్తం చేసాడు . యుధ్ధంలో జయాపజయాలు దైవధీనాలని జ్ఞాపకం చేసాడు . ఒకవేళ ఓడిపోతే కలిగే అవమానం భరించరానిది కనుక సంధి చేసుకోవడంలో తప్పులేదని సూచించాడు . ఇంత యుక్తి యుక్తంగా చెప్పినా సుయోధనుడు వినలేదు . కయ్యానికే కాలు దువ్వాడు .

.

అందుకే అవమానాల పాలయ్యాడు .


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!