🚩అహల్యా శాప విమోచనం.🙏🏿🙏🏿🌹

🚩అహల్యా శాప విమోచనం.🙏🏿🙏🏿🌹


(బాలకాండ మందరమకరందం..సర్గ-49


💥💥


రాముడు విశ్వామిత్రుడితో,మిథిలా నగరానికి వెళ్తుండగా,


ఆ నగరానికి సమీపంలో ఒక నిర్మానుష్యమైన ఆశ్రమము కనపడింది.


అది చూసిన రాముడు విశ్వామిత్రుడితో


"ఓ మహర్షి!ఈ ఆశ్రమము ఎవరిది? ఇక్కడ ఎవ్వరూ లేరు


. దీనికి కారణం ఏమిటి?" అని అడిగాడు.


"ఓ రామా! ఇది గౌతమ మహర్షి ఆశ్రమము. ఆయన భార్య అహల్య.


ఒకనాడు గౌతముడు లేని సమయంలో ఇంద్రుడు గౌతముని


వేషంలో ఆశ్రమానికి వచ్చి, తన కామ కోరిక తీర్చాలని అహల్యను


అడిగాడు.


తన భర్త వేషంలో వచ్చింది దేవేంద్రుడని అని తెలుసుకున్నది


అహల్య. అయినా దుర్బుద్ధితో ఇంద్రునితో రతిక్రీడకు అంగీకరించింది.


అహల్యతో సంగమించిన ఇంద్రుడు ఎక్కడ గౌతముడు వచ్చి తనను


చూస్తాడేమో అని త్వరత్వరగా ఆశ్రమం నుండి బయటకువచ్చాడు.


ఇంతలో గౌతముడు దర్భలను, సమిధలను తీసుకొని ఆశ్రమానికి


వచ్చాడు. తన వేషంలో ఉన్న ఇంద్రుడిని చూసాడు. జరిగిన


విషయం గ్రహించాడు.


"ఓ దుర్మతీ! నేను ఆశ్రమంలో లేని సమయంలో నా వేషంలో నా


ఆశ్రమంలో ప్రవేశించి నా భార్యతో సంగమించినందుకు నీకెదే నా


శాపం. నీ వృషణాలు కింద పడిపోవుగాక" అని శపించాడు


గౌతముడు. అతని శాపం ఫలితంగా ఇంద్రుని వృషణాలు నేల మీద


పడిపోయాయి.


తరువాత గౌతముడు తన భార్య అహల్యను చూసాడు.


అహల్య గడగడ వణికిపోయింది. గౌతముడు తన భార్యతో "


అహల్యా! నువ్వు పాపం చేసావు. కాబట్టి నువ్వు అదృశ్యరూపంలో


మట్టిలో దొర్లుతూ, కేవలం గాలినే ఆహారంగా స్వీకరిస్తూ, తపస్సు


చేసుకుంటూ వేల సంవత్సరాలు ఈ ఆశ్రమంలోనే ఉండు.


దశరథ కుమారుడైన రాముడు ఈ ఆశ్రమంలో ప్రవేశించినపుడు


నీకు శాపవిముక్తి కాగలదు. రాముని పూజించిన తర్వాత నీలో


మోహం నశించి పరిశుద్ధురాలై నన్ను చేరగలవు" అని పలికాడు.


వెంటనే గౌతముడు ఆశ్రమం విడిచి హిమత్పర్వతానికి


వెళ్ళిపోయాడు.


గౌతముని శాపంతో వృషణాలు పోయిన ఇంద్రుడు ఎంతో


దు:ఖించాడు. అగ్ని మొదలగు దేవతలతో, ఋషులతో,


"నేను మీకోసమే ఇదంతా చేసాను. గౌతమునికి కోపం తెప్పించి


అతని తపస్సు వృధా చేసాను. దేవకార్యన్ని సాధించాను.


కానీ నా వృషణాలను పోగొట్టుకున్నాను. కాబట్టి మీరే నా వృషణాలు


మరల వచ్చేటట్టు చేయాలి" అని అడిగాడు.


దేవేంద్రుని మాటలు విన్న దేవతలందరూ పితృదేవతల వద్దకు వెళ్ళి


వారికి యజ్ఞములో అర్పించిన మేషముల వృషణాలు ఇంద్రునికి


ఇవ్వవలసిందిగా అడిగారు. అదే ప్రకారంగా పితృదేవతలు తమకు


యజ్ఞములో అర్పించిన మేషము యొక్క వృషణాలను ఇంద్రునికి


ఇచ్చారు. దేవేంద్రుడు మేషవృషణుడు అయ్యాడు.


రామా! ఇక మనము ఆశ్రమంలోకి వెళ్దాము. అక్కడ అహల్యకు


శాపవిమోచనం కలిగించు." అని చెప్పాడు విశ్వామిత్రుడు.


విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆశ్రమంలోకి ప్రవేశించారు. అప్పటి


దాకా గౌతముని శాపం వల్ల ఎవరికీ కనపడని అహల్య, రామునికి


కనిపించింది. రామ పాద ధూళి సోకిన అహల్యకు శాపవిమోచనం


అయింది. రామలక్ష్మణులు అహల్యకు నమస్కరించారు.


అహల్యకు గౌతముని మాటలు గుర్తుకు వచ్చాయి.


రామునికి అతిథి మర్యాదలు చేసి సత్కరించింది.


ఆ సమయంలో అక్కడికి వచ్చిన గౌతముడు రామ దర్శనం చేసుకొని


పునీతయైన భార్యను స్వీకరించాడు. దంపతులిద్దరూ రాముని


పూజించి తపస్సుకు వెళ్ళిపోయారు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని


అనుసరించి మిథిలకు చేరుకున్నారు.


🌹🌹🌹🌹🌹💥💥💥💥💥🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!