అల వైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు .

అల వైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు దా


పల మందార వనాంతరామృత సర: ప్రాంతేందుకంతోపలో


తృలపర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి


హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించిసం రంభియై....


గజేంద్రుడు మొరపెట్టుకునే సమయంలో ఆ దేవ దేవుడు యేస్తితిలో ఉన్నాడో వర్ణించడం ఈపద్యంలోని చిత్రం..ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మహా విష్ణువు అప్పుడు రమాసాంగత్యంలో తేలియాడుతున్నాడు.

అల వైకుంఠపురం;ఆ పురంలో అంత:పురం.అందులో ప్రధాన సౌధ సమీపంలో అమృతసరోవరం,అక్కడ చంద్రకాంత వేదికపై కలువల పానుపు,,,ఆ పానుపుపై క్రీడిస్తున్న నారాయణుడు ఇదీ పోతన కట్టిన చిత్ర తోరణం

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.