‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. .

‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. 

.

ఇమ్ముగ జదువని నోరును

నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్

తమ్ముల బిలువని నోరును

గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

భావం: --

మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి.

కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. 

తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతో దగ్గరకు రమ్మని పిలవాలి. 

ఈ పనులనన్నిటినీ నోటితోనే చేయాలి. 

ఈ మూడు పనులనూ సరిగా చేయని నోరు... కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది.

మానవులకు మాత్రమే నోటితో మాట్లాడే శక్తి ఉంది. ఆ శక్తిని మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలని ఈ పద్యంలో చెబుతున్నాడు కవి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!