లోకంబులు లోకేశులు...

తెలుగుసాహిత్యంలో ఈ పద్యానికి పెద్దపీట వేశారు. 

ఇంతకుమించిన పద్యం మరొకటి లేదనేంత పేరున్న పద్యం ఇది. 

భగవంతుడు ఎక్కడ ఉంటాడనే విషయాన్ని పోతన తన మనోనేత్రంతో చూసి వివరించాడు.

.

లోకంబులు లోకేశులు

లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం

జీకటి కవ్వల నెవ్వం 

డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్

భావం:--

లోకాలు, లోకాధిపతులు, లోకులు నశించిన తరవాత, లోకమనేది లేనప్పుడు 

ఏర్పడే దట్టమైన చీకటికి అవతల ఏ పరమపురుషుడు ఒకే ఆకారంతో ప్రకాశిస్తాడో 

అతనిని మాత్రమే నేను సేవిస్తాను. 

Comments

  1. గొప్పగున్నాది; మఱేవిటి !!!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!