శ్రీనాధుని..కాశి విశ్వేశ్వర వర్ణన:-- .

కార్తీక పున్నమి శుభా కాంక్షలతో....

శ్రీనాధుని..కాశి విశ్వేశ్వర వర్ణన:--

.

‘’ఎం చెప్పమంటావు అగస్త్య మహర్షీ !పార్వతిని చూస్తె మహా ప్రేమ ,పరమేశ్వరుని చూస్తె మహా క్రోధం గ కనపడ్డారు .అప్పుడు మా మనసులు ఒక పక్క సంతోషం తో మరోపక్క భయం తో గుజగుజ లాడాయి .’’అని చెప్పి వ్యాసుడు కాశి శివుని భార్య కనుక దానిపై అలిగి నేను శివుడి కోపానికి పాత్రుడినయ్యాను .కాశి గౌరికి సపత్నికనుక దానిపై నేను అలగటం వలన ఆమెకు సంతోషం కలిగించిన వాడినయ్యానుఅనిపించింది .శివ పార్వతులు అక్కడికిరాగానే మేమందరం లేచినిలబడి స్వాగతం చెప్పి నమస్కరించి చేతులు చంకలో పెట్టుకొని ఒక ప్రక్కగా నిలుచున్నాం .ఉమా మహేశులు మా దగ్గరకు వచ్చి ఉచితాసనాలలో కూర్చున్నారు .అప్పుడు రుద్రుడు ప్రళయ కాల రుద్రుడులా ఉచ్చ్చైస్వరం తో కోపంగా –

‘’ఓరి దురాత్మ !నీవార ముస్టింపచా- భాసయోజన గ్రంధి ప్రధమ పుత్ర

దేవరన్యాయ దుర్భావనా పరతంత్ర -బహు సంహితా వృధా పాఠపఠన

భారత గ్రంధ గుంభన పండితం మన్య –నీవా మదీయ పత్నికి ,నశేష

కైవల్య కళ్యాణ ఘంటా పధమునకు –గాశికా పురికి నిష్కారణంబ

శాప మిచ్చేదనని యనా చార సరణి –నడుగు బెట్టిన వాడ వహంకరింఛి

పొమ్ము నిర్భాగ్య ,మాయూరి పొలము వెడలి –ఎచటికేన్ శిష్యులు నీవు నీ క్షణంబ ‘’

అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ల దండకాన్ని చదివి కాశీ వదిలిపెట్టి శిష్యులతో సహా బయటికి తక్షణం వెళ్లి పోమ్మన్నాడు విశ్వేశ్వరుడు –పద్య భావం –ఓరి దుర్మార్గుడా వ్యాసా !నీవార ధాన్యాన్ని పిడికెడు ఏరుకొని వండుకొని తినేవాడా ,పెళ్లి కాకుండానే యోజన గ్రంధికి మొదటికోడుకుగా పుట్టిన వాడా ,సోదరుల భార్యలతో సంగమించే చెడు ఆలోచన తో అంటే దేవర న్యాయం తో అస్వతంత్రుడవైన వాడా ,అనేక సంహితలను వ్యర్ధం గా పఠించి పాఠాలు నేర్పిన వాడా ,భారతాన్ని రాశానని మిణికేవాడా ,పండితుడినని అనుకొనే వాడా ,నువ్వా ,సమస్త శుభాలకు రాచ బాట అయిన కాశికా పురికి కారణం లేకుండానే శాపం ఇస్తానని సంప్రదాయ విరుద్ధం గా అహంకరించిన గర్విస్టీ,శిష్యులతో సహా ఈ క్షణం నుంచి కాశి వదిలి వెళ్ళిపో ‘’

అంతటితో ఆగాడా హరుడు ?ఇంకో అడుగు ముందుకేసి –

‘’పోక నడగొట్టి తేనియు –రాకింతు జుమీ మొగంబు రాచట్టు పయిం

శ్రీ కాశిక నిందించిన –నే నీకింతట నేలపోవు నీచ చరిత్రా’’

అని ఫుల్ గా వాయిన్చిపారేశాడు .నీచ చరిత్ర ఉన్న నువ్వు కాశి ని వదలకుండా ఇక్కడే ఉంటె , నువ్వుకోపం తో భిక్షా పాత్రను రాతిమీద వేసి నూరు ముక్కలయ్యేట్లు కొట్టిన విధంగా నీ ముఖాన్ని బండ రాతి మీద చితక కొడతాను .కాశీని నిందించిన ఫలితం ఊరికే పోతుం దనుకోన్నావా ?

మళ్ళీ అందుకొని –

‘’వడి విడువక యియ్యడువున –నుడుపతి మకుటుండు చెవుల కొనరని నుడుగుల్

నొడివిన నే నయ్యిరువుర –యడుగుల బడి కాశి వెడలి యరిగెడు వేళన్ ‘’

చంద్రుని కిరీటం గా ధరించిన శివుడు వేగం గా ఆవేశం గా ,చెవులు భరించరాని తిట్లకు శాపానికి భయపడి ఆ దంపతుల పాదాల పై వ్రాలి కాశీ వదిలి బయల్దేరటానికి సిద్ధమవగా –అప్పుడా పార్వతీ దేవి సాంత్వన వచనాలు పలక నా రంభించింది –ఆమె ఏమన్నదో తర్వాత తెలుసుకొందాం .డకకార ప్రాస తో చిన్న పద్యం రాసి వేగాన్ని ,ఒణుకును భయాన్ని క్రోధాన్ని ఆవిష్కరింప జేశాడు శ్రీనాధకవి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!