పోతన గారి.....భాగవత పద్యాలు!

పోతన గారి.....భాగవత పద్యాలు!

అన్నీ ఉన్నా ఇంకా ఏమేమో కావాలనే కోరికతో పృకృతిని పాడు చేసే కాలంలో మనమున్నాం . సుఖమైన జీవితాన్ని గడపడానికి అన్నీ భగవంతుడమర్చిపెట్టాడు

.” సింప్లిసిటీ ” లో అనిర్వచనీయమైన ఆనందముందని మనం తెలుసుకోవాలి . 

ఆ విధంగా నడుచుకోవాలి . 

.

సీ. కమనీయ భూమి భాగములు లేకున్నవే

పడియుండుటకు దూది పరుపులేల?

సహజంబులగు కరాంజలులు లేకున్నవే

భోజన భాజన పుంజమేల?

వల్కలాజిన కుశావళులు లేకున్నవే

కట్టదుకూల సంఘంబులేల?

గొనకొని వసియింప గుహలు లేకున్నవే

ప్రాసాద సౌధాది పటల మేల?

.

తే. ఫలరసాదులు కురియవే పాదపములు

స్వాదుజలముల నుండవే సకల నదులు

పొసగ భిక్షము బెట్టరే పుణ్య సతులు

ధన మదాంధుల కొలువేల తాపసులకు

.

నిజంగా చూస్తే జీవితాన్ని ఆనందించడానికి కావలసినవన్నీ పుష్కలంగా ఇచ్చాడు

పరమాత్మ . పచ్చని గడ్డి మైదానాలు మనకిస్తే , దూది పరుపుల మీద పడుకోవాలనే కోరిక మనది . అన్నం నోటికందించడానికి చేతులు ( కరాంజలులు ) ఉన్నాయి .

అయినా కంచాలూ గరిటల మీద మోజు . శరీరాన్ని కప్పుకోవడానికి నార బట్టలున్నాయి . అయినా పట్టుపుట్టాలంటే పరమ ప్రీతి . 

నివసించడానికి పృకృతి సిధ్ధమైన గుహలున్నాయి ( తాపసులకు మాత్రమే ) . కానీ కావాలి మేడలూ మిద్దెలూ .ఫలాలను వర్షిస్తున్నాయి..

స్వాదుజలాలను అందిస్తున్నాయి సకలనదులు . అడగకుండానే అన్నపూర్ణ లాగా అన్నం పెడుతున్నారు పుణ్య సతులు .కానీ కోరికలు చావడం లేదు . 

ధనంతో మదమెక్కిన వారిని సేవిస్తున్నారు .ఏమి బాముకొందామనో ?

పరమ భోగాలు అనుభవిస్తూ పడతుల పొందులో పాపాలు చేస్తూ , వేలకొలది ఎకరాలలో ఆశ్రమాలు కట్టుకొని మననాకర్షిస్తూ సాధువులమంటున్న వారు నిజమైన సాధువులు కారనీ , వారి కుతంత్రాలకు దూరంగా ఉండమనీ చెబుతుందీ పద్యం .

ఇంకో విషయం . అన్నీ ఉన్నా ఇంకా ఏమేమో కావాలనే కోరికతో పృకృతిని పాడు చేసే కాలంలో మనమున్నాం . సుఖమైన జీవితాన్ని గడపడానికి అన్నీ భగవంతుడమర్చిపెట్టాడు .” సింప్లిసిటీ ” లో అనిర్వచనీయమైన ఆనందముందని మనం తెలుసుకోవాలి . ఆ విధంగా నడుచుకోవాలి . అదీ ఈ పద్యానికి పరమార్థం .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!