లేపాక్షిబసవన్న!

లేపాక్షిబసవన్న!

.

“లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరాన నడచి రావయ్య''

.

స్వాతంత్ర్య పూర్వం బహుముఖ ప్రతిభావంతులైన అడవి బాపిరాజు .పరవసుడయే

పాడి ఆ నంది గొప్పదనం చాటారు

.

ఈ లేపాక్షి బసవన్న 8.1 మీటర్ల పొడవు, నాలుగన్నర మీటర్ల ఎత్తుతో

మహా లింగానికి ఎదురుగా కూర్చుని ఉంటుంది. 

ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది శిల్పంగా పేరుగాంచింది. 

తంజావూరు బృహదీశ్వరాలయం, మైసూరులోని చాముండి హిల్, 

బెంగళూరులోని బసవనగుడిలలో ఉండే నంది విగ్రహాలకంటే, లేపాక్షి విగ్రహమే పెద్దది.

మంచి ఆరోగ్యంతో ఉండే చక్కటి కోడెగిత్త విగ్రహమే లేపాక్షి. గంటలు, లోహపు బిళ్లలతో కూడిన పట్టీలు మొదలైన ఎన్నో అలంకరణలు ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం నంది మెడలో కనిపించే రెండు గరుడ పక్షులు, వాటి ముక్కుల్లో వేలాడే ఏనుగులే. ఇది ఆ పక్షుల శక్తిని, పరిమాణాన్ని సూచిస్తుంది.

.

సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, 

ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును 

చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, 

జటాయువు లేచి నిలుచుందని, 

అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!