తెలుగు నాటకాలలో హాస్యం !

తెలుగు నాటకాలలో హాస్యం !

.

1880కు పూర్వం మన ఆంధ్రదేశంలో రంగస్థల ప్రదర్శనలు లేవు. అప్పట్లో ధార్వాడ్ వారు వచ్చి, తాత్కాలిక నాటక శాలలు కట్టి, అందులో హిందీ, మరాఠీ నాటకాలు ఆడేవారు.

ఒకసారి రాజమహేంద్రవరలో వాళ్ళు నాటక ప్రదర్శనలు ఇచ్చి వెళ్ళిపోయాక వాళ్ళు వదిలిన పాకలలో "కందుకూరి వీరేశలింగంపంతులు" గారు వారు రచించిన" చమత్కార రత్నావళి "అనే నాటికను ప్రదర్శించారు. ఇదే తెలుగు నాట ఆడబడిన తొలి నాటిక. ఇది హాస్య నాటిక కావడం గమనార్హం. ఇది షేక్స్పియరు "కామెడీ ఆఫ్ ఎర్రర్స"కు అనుసరణ.

ఈ ప్రదర్శనకు చాలామంది ప్రేక్షక్కులు వచ్చి, చూచి ఆనందించారు.

బ్రహ్మవివాహ విషయంలో కామయ్య తన రెండేళ్ళ వయస్సు కుమార్తెను ముసలి వాడికి పన్నెండువందల రూపాయల కన్యాశుల్కం పుచ్చుకొని పెళ్ళి చేస్తాడు. అయితే పెళ్ళికి ముందుగా వూరి పెద్దలను తను ఇలా కన్యాశుల్కం పుచ్చుకోవడం తప్పా అని అడిగితే ఒక శాస్త్రులు గారు ఏవేవో శ్లొకాలు కల్పించి, ఉదాహరణగా చెప్పి కన్యా కన్నా రెండింతలెత్తు ధనం పుచ్చుకొని పెళ్ళి చేస్తే కోటి యోగాల ఫలితం దక్కుతుందని సమర్ధిస్తారు.

కోర్టులో జరిగే అన్యాయాలను బహిర్గతం చెయ్యడమే వ్యవహార బోధిని నాటకం లక్ష్యం ఒక దళారి ఇద్దరు అన్నదమ్ముల మధ్య వ్యాజ్యం నడిపించడానికి తలో వకీలు దగ్గరకు తీసుక్కు వెళ్ళి కమీషను పుచ్చుకుంటాడు. ప్లీడర్లు కూడా తమకు వీలయినంత సొమ్ము రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా ప్రజలలో కక్షలు కావేషాలు రెచ్చగొట్టి వాళ్ళని వ్యాజ్యాలకి పురిగొలిపి మధ్య దళారులు ప్లీడర్లు ఎలా బాగుపడతారో, ఈ అసాంఘిక కార్యక్రమాలను పంతులుగారు తాము వ్రాసిన ఇరవై హాస్య నాటకాలలో చూపించారు.

వీరి సమకాలీనులైన"వేదం వెంకట్రాయ శాస్త్రి" గారు "ప్రతాపరుద్రీయం" అనే హాస్య మిళితమైన నాటకం వ్రాసి ప్రదర్శించారు. ఇందులో పదగత, వాక్యగత, సన్నివేశగత హాస్యం చిందులేస్తూవుంటుంది. పేరిగాడి పాత్ర సహజసిద్ధమైన రూపం, అతని కట్టుబొట్టులో ఆటలో, పాటలో, మాటలో అన్నిటిలోను సిసలైన జాతీయత వుట్టిపడుతుంది.

"చిలకమర్తి లక్ష్మీనరసింహం' గారు కూడా "వీరేశలింగం 'గారి ఫక్కీనే ఆనాటి సాంఘిక దురాచారాలను ఖండిస్తూ ఇరవైహాస్య నాటికలు రచించారు. వీరు వ్రాసిన బలవంతపు భ్రాహ్మణార్ధం నాటికలో ఒక కరణంకు తన తల్లి తద్దినం ఎప్పుడో తెలియదు. పురోహితుడు వచ్చి ఆరోజే అని చెప్పగానే అయ్యో ఉదయాన్నే మొహమైనా కడుక్కోకుండా చద్దివన్నం వుల్లి ఆవకాయ వేసుకొని తిన్నానే ఎలా? అంటే తమరు మొహం కడుక్కోకుండా తిన్నారు కనుక అది నిన్నటి లెఖ్ఖలోకి వస్తుంది అని సర్ది చెప్పి వెట్టి వాణ్ణి పంపించి వూరి చివర కాపుకాసి దారిని పోతున్న బ్రాహ్మణున్ని రెండవ భోక్తగా బలవంతాన రప్పిస్తారు. పురోహితుడు అంతకు క్రితం రాత్రి భార్యతో జగడమాడితే ఆమె అతని జందెం కాస్తా పుటుక్కున తెంపేస్తుంది. మళ్ళీ జందెం వేసుకోవడం మర్చిపోయి వచ్చేసాడు. అతని మెళ్ళో జందెం లేకపోవడం చూసి రెండో బ్రాహ్మణుడు ప్రశ్నించగా ఈ తద్దినం కరణం గారి తల్లి గారిది, ఆడవారికి జందెం వుండదు కనుక నువ్వు కూడా జందెం తీసెయ్యమంటాడు.

వీరు వ్రాసిన గణపతి నవల ఆధారంగా విజయవాడ ఆకాశవాణి వారు రూపకంగా మలిచి ఎన్నో సార్లు ప్రసారం చేసారు. ఇది ఆద్యంతం అద్భుతమైన హాస్య రచన. లక్ష్మీనరసింహం గారి ప్రహసనాలలో ఒక విశిష్టత వుంది. నేరస్థులను మృదువుగా మందలించి, క్షమించి, సంస్కరిస్తారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!