1864 నాటి బందరు ఉప్పెన కధ!


1864 నాటి బందరు ఉప్పెన కధ!

.

అక్టోబరు 13 న వచ్చిన పెను తుపానులో కృష్ణా జిల్లా, మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు ట!

రక్తాక్షి నామ సంవత్సరంలో, 1 నవంబర్ 1864 న, బందరులో సముద్రం పొంగి, ఊరు ములిగిపోయిందని చెప్పుకుంటారు. 

“స్థలపూరాణం” ప్రకారం “ఉమ గోల్డ్ కవరింగ్” వారి భవనం మొదటి అంతస్తు అంతా ములిగిపోయి, నీరు రెండవ అంతస్తు వరకు వచ్చేసిందిట. 

వివరాలకి ఇప్పుడు సాక్షులు దొరకరు కాని వినికిడి కబుర్లే నిజం అయితే 30,000 మంది చచ్చిపోయారుట. సముద్రం చెలియలికట్టని దాటి, నాలుగైదు కిలోమీటర్లు లోపలికి చొచ్చుకొచ్చి, జనావాసాలని ముంచేసిందన్న మాట! దీనిని "బందరు ఉప్పెన" అని ప్రజలు అభివర్ణిస్తారు.

బందరుకి మచిలీపట్నం అన్న పేరు రావటానికి వెనుక కథ ఒకటి ఉంది. సముద్రపుటొడ్డున ఉన్న కోట ద్వారం దగ్గర ఒక చేప విగ్రహం ఉండేది. అందుకని ఈ ఊరికి మచిలీపట్నం అన్న పేరొచ్చిందంటారు. 'మచిలీ' అంటే హిందీ భాషలో చేప, పట్నం అంటే పెద్ద ఊరు. తెలుగు దేశంలో పట్టణం అనేది సర్వసాధారణంగా సముద్రపు ఒడ్డున ఉన్న రేవులకే వాడతారు. ఉదాహరణకు చెన్నపట్నం, విశాఖపట్టణం, భీమునిపట్నం, కళింగపట్నం, నిజాంపట్నం మొదలైనవి. పట్నంతో ముగిసే పేర్లు కల ఊళ్ళు అన్ని తూర్పుకోస్తాలో ఉన్నాయి. నర్సీపట్నం మినహాయించి..

1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీవారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో విశాఖపట్టణం కూడా ఒకటిగా ఉండేది.[8] ఈ పట్టణానికి మచిలీపట్నం, అనీ బందరు అనీ మాత్రమే కాక పూర్వం మచిలీ బందరనే పేరు కూడా వ్యవహారంలో ఉండేది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!