వడ్డాదిపాపయ్య గారి చిత్రం.!

వడ్డాదిపాపయ్య గారి చిత్రం.!

.

ఓసారి బలరాముడు అతని స్నేహితులు కలసి యశోదతో కృష్ణుడు మన్ను తిన్నాడని పితూరీ చేస్తారు. అప్పుడు యశోద కృష్ణుని పట్టుకుని నిలదీసి అడుగుతుంది 'మన్ను తిన్నావటా'ని. అప్పుడు కృష్ణుడు యశోదతో--

శా.

అమ్మా! మన్ను దినంగ నే శిశువునో యాఁ కొంటినో వెఱ్ఱినో

నమ్మంజూడకు వీరి మాటలు మది న్న న్నీవు కొట్టంగ వీ

రిమ్మాగ్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీ యాస్య గం

ధ మ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.

అని పలికి కృష్ణు డమ్మకు నోరు తెఱచి చూపిస్తాడు.ఆమె అతని నోటిలో 'జలధి పర్వత వన భూగోళ శిఖి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండా'న్నంతా చూచి ఇలా అనుకొందట.

పై పద్యంలోని మాటలన్నీ మన చిన్నపిల్లలు మనతో మనం నిలదీసినప్పుడు చెప్పే మాటలే! ఎంత సహజసిద్ధమైన ధారాశుద్ది! చిన్నపిల్లల్ని- వాళ్ళుచేసే చెడ్డ పనులను గురించి వాళ్ళను దండించాలని చూసే ప్రతి తల్లి తోనూ ప్రతిపిల్లవాడు తనను తాను సమర్ధించుకుంటూ పలికే ముద్దు ముద్దు పలుకులే కిట్టయ్య నోటినుంచి కూడా అలవోకగా జాలువారేలా చేసారు పోతన గారు.

వీటినానందించటం కోసమైనా మనం భాగవతం తప్పక చదవాలి.

అప్పుడా యశోద తనలో తను --

మ.

కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!

తలప న్నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర

స్థలమో! బాలకుఁ డెంత! యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర

జ్వల మై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్!

మా చిన్నప్పటి రోజుల్లో ఈ రెండు పద్యాలు దాదాపు అందరికీ కంఠస్థంగానే ఉండేవి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!