"ఉడుతా భక్తి "--సామెత !

"ఉడుతా భక్తి "--సామెత !

లంక రాజైన రావణాసురుడి నుండి తన భార్యయైన సీతాదేవిని రక్షించుకోవడాన్కి యుద్ధం చేయవలసినచ్చి శ్రీరాముడు సముద్రాన్ని దాటవలసివచ్చింది.

హనుమంతుడు, సుగ్రీవుడు మొదలగు వానరసైన్యం లంక దాకా సముద్రంపై వంతెన కట్టడానికి సిద్ధమైంది. నలుడు వానర సైన్యానికి నాయకుడిగా వుండి అనేక లక్షల మంది వానరుల సహాయంతో పెద్దపెద్ద రాళ్లని పెళ్లగించి తెచ్చి సముద్రంపై వారధి నిర్మించారు.

ఆ సమయంలో ఆ సమీపంలో వుండి యిదంతా చూస్తున్న ఒక ఉడుత శ్రీరామునియెడల భక్తితో తను కూడా చేతనైనంత సహాయం చేయాలనుకుని సముద్రం నీటితో తన తోకను తడుపుకుని సముద్రపు ఇసుకలో పొర్లించి వానరులు నిర్మిస్తున్న వారధిపై తన తోకను దులుపుతూ సాయం చేసింది.

ఇది గమనించిన శ్రీ రాముడు ఆ ఉడుత భక్తి శ్రద్ధలకు ఎంతో ఆనందం చెంది చేతులలోకి తీసుకుని దాని వీపుపై మూడు వేళ్లతో ఆప్యాయంగా నిమిరాడట. దాంతో ఉడుత వీపుపై మూడు చారలు ఏర్పడ్డాయని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.

-

ఈ కథ ఆథారంగా "ఉడుతా భక్తి" అనే సామెత వాడుకలోకి వచ్చిందంటారు.

ఎవరికి చేతనైన రీతిలో వారు తమ భక్తి శ్రద్ధలను ప్రకటించుకోవడంలో తప్పు లేదని,దానిలో నిజాయితీ,చిత్తశుద్ధి మాత్రమే వుండాలని తెలియజేసేందుకు ఈ సామెతను వాడుతున్నారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!