-

శ్మశానవాటి !

-


సాహిత్యంలో మంచి కవిగా పేరొందిన జాషువా శ్శశానం గూర్చి

అత్యద్భుతంగా వర్ణిస్తూ చెప్పిన ఈ పద్యం తెలుగు సాహిత్యంతో 

ఎంతో వ్యాప్తమై, కీర్తిని పొంది, స్థిరత్వాన్నందినది!

ఈ పద్యం బలేజిపల్లి వారి సత్య హరిచంద్ర 

నాటకం లో కూడ వినిపించేవారుఅబ్బూరి వారు.

.

మా వాచ్ మాన్ చాల బాగా చదువుతాడు..

వాడు అబ్బూరి వారి శిష్యుడు ...(అర్ధం కూడా తెలుసు...7 వ క్లాసు చదివేడు.)

_

ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశానస్థలిన్‌

కన్నుల్‌ మోడ్చిన మందభాగ్యుడొకడైనన్‌ లేచి రాడక్కటా

ఎన్నాళ్ళీ చలనంబు లేని శయనం బేతల్లు లల్లాడిరో

కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కం బిందు పాషాణముల్‌

-

ఆకాశంబున కారుమబ్బు గములాహారించె దెయ్యాలతో

ఘూకమ్ముల్‌ చెరలాడసాగినవి వ్యాఘోషించె నల్దిక్కులన్‌

కాకోలమ్ములు గుండె జల్లు మనుచున్నంగాని ఇక్కాటియం

దాకల్లాడిన జాడ లేదిచట సౌఖ్యంబెంత క్రీడించునో

-

ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని

కలము నిప్పులలోన కరిగిపోయె

ఇచ్చోటనే భూములేలు రాజన్యుని

అధికార ముద్రిక లంతరించె

ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూ

సల సౌరు గంగలో కలిసిపోయె

ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికం గన్న

చిత్రలేఖకుని కుంచియ నశించె

ఇది పిశాచులతో నిటాలేక్షణుండు

గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు

ఇది మరణదూత తీక్షణ దృక్కులొలయ

అవనిపాలించు భస్మ సింహాసనంబు

_


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!