ఇన్నాళ్ళు, మనం ఏదో కోల్పోయాము, అనే వేదన నుంచి బయట పడ్డట్టు అనిపించింది..

శ్రీ నరేంద్ర మోడీ ని ప్రజలు అత్యధిక మెజారిటీ తో గెలిపించారు. మోడీ నోట జై భారత్ అని వింటూ వుంటే మనసుకు తృప్తి గా ఉంది. అయన గంగా హారతి కార్యక్రమం చూస్తూ ఉంటె ఎంతో సంతోషం అనిపించింది. ఏదో మనకు సంబంధించిన మన మనిషి, మన సొంతవాడు అక్కడ ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నట్టు అనిపించింది. మోడీ గెలిచినట్టు టీవీల్లో చుసిన తర్వాత చాలా కాలం తర్వాత మన దేశానికి మనం వచ్చినట్టు భావన కలిగింది. ఇది భారత దేశం, ఇది మనది, మనం భారత దేశ వాసులం అనే సంపూర్ణ భారతీయ భావన కలిగింది. కారణం ఏమిటో తెలియదు కానీ, ఇన్నాళ్ళు, మనం ఏదో కోల్పోయాము, అనే వేదన నుంచి బయట పడ్డట్టు అనిపించింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!