చందమామ కధ... మూడు రాళ్ళు.!


చందమామ కధ... మూడు రాళ్ళు.!
ఒక ఊరిలో నారాయణ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు బాగా వృద్ధుడు. ఒకరోజు నారాయణ తన ముగ్గురు కొడుకులను పిలిచి, ఇలా అన్నాడు.
నాయనలారా! నేను ఎంతోకాలం జీవించను. ఇంతకాలం కష్టపడి వ్యాపారాన్ని
అభివృద్ధి చేసి, ఈ ఆస్తిని సంపాదించాను. మిమ్మల్ని పెంచి పెద్దవాళ్లను
చేశాను. ఎప్పటికైనా నా బాధ్యతలు మీకు అప్పగించాలి కదా.
అందుకు ఏం చేయాలో పూర్తి వివరాలు ఆ మూలనున్న పెట్టెలో ఉంచాను. మీరు నా మరణానంతరం ఆ పెట్టెను నా ప్రాణమిత్రుడు సత్యమూర్తి సమక్షంలో తెరవాలి. సత్యమూర్తి తెలివైనవాడు. నా వ్యాపారాభివృద్ధికి
అతను ఎన్నో సలహాలిచ్చినవాడు. అందుకే అతను చెప్పినట్లు నడుచుకోండి.
అప్పుడే నాకు మనఃశాంతి కలుగుతుంది. అలా చేస్తామని నాకు మాటివ్వండి’’
అన్నాడు.
అలాగే చేస్తామని ముగ్గురు కొడుకులూ ప్రమాణం చేశారు. కొద్దిరోజుల్లోనే నారాయణ మరణించాడు. ఆ తర్వాత ముగ్గురు కొడుకులూ, తండ్రి ఇచ్చిన పెట్టెను సత్యమూర్తి దగ్గరకు తీసుకెళ్లారు.
సత్యమూర్తి ఆ పెట్టెను తెరవమన్నాడు. ఆతృతగా వారు ఆ పెట్టెను
తెరిచారు.
అందులో ఇంటి తాళాలు, మూడు రాళ్లు, ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరం పైన ‘సత్యమూర్తి మాత్రమే చదవాలి’ అని రాసి ఉంది.
సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని తెరిచి చదివాడు. తర్వాత ముగ్గురి వైపు
తిరిగి, అబ్బాయిలూ! ఈ ఉత్తరంలో మీ నాన్న తన చివరి కోరిక రాశాడు అని చెప్పాడు.
ఏంటది?’’ అన్నారు ముగ్గురూ ముక్తకంఠంతో.
ఆ కోరిక ఏదో మీకు తర్వాత చెబుతాను. ముందు ఆ మూడు రాళ్లను
పెట్టెలో ఎందుకు పెట్టాడో తెలుసుకోవాలి. మీకు ఏమైనా తోస్తే చెప్పండి’’ అని
అడిగాడు సత్యమూర్తి.
ఓస్! అదేమంత పెద్ద విషయం కాదు. మీ ముగ్గురు మూడురాళ్లను
వెనకేసుకోండి. అంటే దుబారా ఖర్చులు మాని, మరింత సంపాదించండి అని చెప్పి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!