అల్లసాని వారి అవసరాలు......కావ్యరచనా ప్రరోచనా సామగ్రి !!.

అల్లసాని వారి అవసరాలు......కావ్యరచనా ప్రరోచనా సామగ్రి !!.

.

ఆశువుగా కవిత్వం చెప్పడం ఆషామాషీ కాదు, 

అందుకు

ఏమేం కావాలో సెలవిస్తున్నాడు ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన. ఇవన్నీ ఉంటేగాని కృతి కూర్చడం వల్లకాదని ప్రభువు కృష్ణదేవరాయలకే విన్నవిస్తాడు.

భంగపాటుకు ఆస్కారం లేని ఏకాంతపు స్థలమట, ఆత్మకింపయిన భోజనమట, 

ఆ పై ప్రియరమణి తాంబూలం తెచ్చివ్వాలట, 

మేను వాల్చడానికో ఊయల మంచమట... అంతటితో చాలదు, 

తప్పొప్పులు ఎత్తిచూపగల రసజ్ఞులట, 

తానేమి చెబుతున్నానో ఊహించగల ఉత్తములగు లేఖకులు-పాఠకులు...

ఇవన్నీ సమకూరితే కాని, ఊరకే కావ్యాలు రచించమంటే అయ్యే పని కాదని స్పష్టం చేస్తాడు ఈ కవివరేణ్యుడు. 

ఇదే పెద్దన ఇంకో సందర్భంలో ఆశుకవిత్వమంటే ఏంటో పేరిణి శివతాండవమాడినట్టు ఆడి, తన తడాఖా చూపించాడు.

"కృతి వినిర్మింపు మొకటి మాకు శిరీషృ సుధామయోక్తుల పెద్దనార్య! "- 

అనిరాయలవారు పెద్దన్న గారి నడిగినారట. దానికి సమాధానంగా రాయలకు 

పెద్దన్న చెప్పిన సమాధాన మేమిటో వినండి!

.

చ: నిరుప హతి స్థలంబు; రమణీప్రియ దూతిక తెచ్చి యిచ్చు క

ప్పుర విడె ; మాత్మకింపయిన భోజన ; మూయెల మంచ; మొప్పు,త

ప్పరయు రసజ్ఙు ; లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్;

దొరకినగాక , యూరక కృతుల్ రచియింపు మటన్న, శక్యమే !!

.

భావం:- 

1 నిరుపహతి స్థలంబు

2 రమణీప్రయ దూతిక యిచ్చే కర్పూర తాంబూలం

3చక్కనిభోజనం

4 సేదతీరేందుకుఊయలమంచం 

5 గుణ ,దోషములను చెప్పగల పండితులు

6 కవిమనస్సులోని భావాన్నికనిపెట్టగల వ్రాయస కారులు.,

పాఠకులు దొరకిన తప్ప కృతినిర్మింపు మనిన యసాధ్యము; అనిభావం!

అవును కమ్మని కవిత్వంకావాలంటే, అదిరావాలంటే యివన్నీ చాలాఅవసరమే! ఇందులో ఊయలమంచము వంటి ఒకటో అరో లేకున్నా యిబ్బంది ఉండదేమో!

కవికి ప్రశాంతమైన వాతావరణం చాలాఅవసరం. చుట్టూఉన్నప్రకృతి యతనిలోనియూహలకు దోహదం చేసేదిలా ఉండాలి. సూణాపణందగ్గర కూర్చోబెట్టి కవిని కవిత్వం చెప్పమంటే ఆకంపేగాని, యింపైన కవిత్వం యెలావస్తుంది? కాబట్టి నిరుపహతి స్ధలంబు అవసరమే!

అందమైన ఆడపిల్ల అందించే కర్పూర తాంబూలం మరొకటి. 

ఆపిల్ల అందమైనదైతే చాలదు.ప్రియ కావాలి యెవరికి?కవిగారికి.

ఆయన అల్ల సాని గలవారుగదా! అప్పుడు కవిత్వం ఉరకలుపెడుతూ విజంభిస్తుంది. ప్రబంధయుగం కవులు.వారికావ్యలు శృంగారకేళికలు.కాబట్టి వారు అవసరమే వారికి.

ఆత్మకింపయిన భోజనము. కడుపునిండాతింటే కవికి కళ్యాణమయ కవిత్వం చెప్పే మనఃపరిణతికలుగుతుంది. కడుపు మాడుతూఉంటే, కమ్మనికవిత్వం వస్తుందా?కలికవిత్వమో, ఆకలికవిత్వమో వస్తుంది.కదా!

ఊయలమంచము-

రాయలనాటికవులు భోగపరాయణులు ఆనాటి యీఊయలమంచములకు "తూఁగుటుయ్యెలలు". అనిపేరు.సుఖంగామెక్కి యీమంచమెక్కి కునుకు తీస్తూఉండటం వారికి అలవాటు. ఆయలవాటుకు సూచనమిది. యిదియవసరమోకాదో పాఠకులేనిర్ణయింతురుగాక!

ఒప్ప తప్పరయు రసజ్ఙులు, యిది చాలగొప్పవిషయము. చక్కనిపరిష్కర్తలుఉండాలి.వారు 'రసజ్ఙుసగుట' గమనింపదగినయంశము.రాగద్వేషములకు లోనుగాక ,కేవల దోషైకదృక్కుమాత్రమేగాక, గుణభాక్కు లయిఉండవలెను.అప్పుడాకావ్యం కమనీయంగా రూపొందగలదుగదా!

ఇక చివరిది. ఊహతెలిసి వ్రాసే లేఖకులు. లేఖకుడు సరయైనవాడుకాకుంటే, కవితివంకాస్తా కపిత్వం కిందమారిపోతుంది. వ్యాసునకు గణపతివలెను,తిక్కనకు గురు నాధునివలెను వ్రాయసకారులు ఉండాలి. అప్పుడు కవియభిప్రయాలు అద్దంలోనీడలా ప్రతిబింబిస్తాయి.

అలాగే రసహృదయంతో చదివే పాఠకుడు కూడా అవసరమే!లేకపోతే కవిశ్రమకు తగిన ఫలితం లభించదు.

ఇదిగో యేవంవిధ సౌకర్యాలను సమకూర్చి అప్పుడు కావ్యంగురించి అడగాలి.యేమీ లేకుండా కన్మనికృతుకావాలంటే, ఊరక వస్తాయా? అన్నాడు పెద్దన నిజమేమో

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!