దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు” !

దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు” !

నిఘంటువు అవసరం లేకుండానే, దీంట్లో గాంధారి గుండె మంట 

మనల్ని కాల్చేస్తుంది.

  దీనిని భారతంలో కెల్లా చెప్పుకోదగ్గ పద్యమంటారు. 

నాకు చాలా ఇష్టైమైన పద్యం.

.

శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు సభలో దక్షులైన సభాసదులు ఉపేక్షిస్తే 

సర్వనాశనం తప్పదని హెచ్చరించే పద్యం:

.

“సారపు ధర్మమున్ విమల సత్యమున్‌ పాపముచేతన్‌ బొంకుచేన్‌

పారమున్‌ పొందలేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు లె

వ్వార లుపేక్ష సేసిరది వారలచే టగుఁగాని ధర్మని

స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవముండెడున్.

.

సమాజంలో సత్యం, ధర్మం దారుణంగా పతనమౌతూ ఉంటే, దానిని నిరోధించే

శక్తి కలిగి ఉండీ, ఉపేక్షచేస్తే, ఆ ఉపేక్ష ఫలితం తమ పతనానికీ, సర్వ

అనర్థాలకూ కారణమవుతుంది.”

.

గాంధారి కృష్ణుణ్ణి, కురుపాండవుల మధ్య యుద్ధాన్ని ఆపగలిగే సామర్ధ్యం ఉండీ ఉపేక్ష చేశాడనీ, దానికి ఫలితం అనుభవించాలనీ శపిస్తుంది.


“దక్షులెవ్వారు లుపేక్ష సేసిరది వారల చేటగు” - 

అది అనేక సందర్భాలలో గుర్తుంచుకోవాల్సిన మాట.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!