మనిషి-జంతువు*!

మనిషి-జంతువు*!

"మనిషి". "మాట్లాడే బుద్ధజీవి" అని మనిషిని జంతుశాస్త్రం అభివర్ణిస్తుంది.
మన సంస్కృతి జంతువులకు అసమాన ప్రాధాన్యం ఇచ్చింది.
దేవతల పక్కన ఏదో ఒక జంతువుంటుంది.
శివపూజకు ముందుగా నందికి నమస్కరించాల్సిందే!
ఏనుగు మొర ఆలకించి మహావిష్ణవు ఉన్న పళాన బయలుదేరాడు. ఆ తొందరలో తన వాహనమైన గరుత్మంతుణ్ని సైతం అధిరోహించలేదని పోతన వర్ణించాడు. అయినా ఆయన వెనుకే వచ్చాడు గరుత్మంతుడు.
.
సత్యకాముడి గురువు హరిద్ర మహర్షి. ఆయన నాలుగు వందల గోవుల్ని ఇచ్చి, మేపుకొని రమ్మని సత్యకాముణ్ని పంపాడు. అవి వెయ్యి గోవులుగా అభివృద్ధి చెందాయి. తిరిగి వస్తున్నప్పుడు మందలోని వృషభం సత్యకాముడికి ఉపదేశం చేసింది. రెండో రోజు అగ్ని, మూడో రోజు హంస. నాలుగోరోజు "మద్గు" అనే నీటిపక్షి ఉపదేశించాయి. వాటి వల్ల సత్యకాముడు తేజస్వి అయ్యాడు.
.
ఏది సాధించాలన్నా దీక్ష వుండాలి. మన దీక్షలకు ఆదర్శం పశుపక్ష్యాదులే!
దీక్షవల్ల అజ్ఞానం అనే పొర తొలగిపోతుంది.
కోడి దీక్షతో గుడ్డును పొదుగుతుంది. గుడ్డును పగలగొట్టుకొని పిల్ల బయటకు వస్తుంది. దీన్ని కుక్కుటదీక్ష అంటారు.
గురువు అనుగ్రహించే ఈ దీక్షవల్ల శిష్యుడు అజ్ఞానమనే అండాన్ని చేధించుకొని
జ్ఞానం పొందుతున్నాడు.
ఇంకోటి మత్స్యదీక్ష చేపలు గుడ్లను పొదగవు.చూస్తూ వుంటాయి.
ఆ గుడ్లు పిల్లలు అవుతాయి. గురువు అనుగ్రహంతో చూడటమే నయనదీక్ష.
ఇదే మత్స్య దీక్ష.
తాబేలు ఇసుకలో గుడ్లు పెట్టి నీళ్ళలోకి పోతుంది. దూరంగా పోయినా, దాని ధ్యాస గుడ్లపైనే! ఇదే కమఠ దీక్ష. గురువు స్మరణమాత్రం చేత శిష్యుల్ని జ్ఞానులుగా చేస్తాడు. ఇలాంటి విశ్వాసాలు, గాథలు మన సంప్రదాయం జంతువులకు ఇచ్చిన విలువను చాటుతున్నాయి.
కాళిదాస మహాకవి మనుషులకు జంతువులపై ఉండాల్సిన ప్రేమను
"శాకుంతలం" నాటకంలో మనోజ్ఞంగా సూచించాడు. ముని వాటికల్లో స్వేచ్ఛగా సంచరించే జింకలను, వాటిని ప్రేమతో పెంచే ముని కుటుంబాలను ఆయన వర్ణించాడు. తపోవనాల్లో పులులు, జింకలు ఒకే చెట్టునీడన విశ్రాంతి తీసుకునే దృశ్యం సాధుప్రవృత్తి పవిత్రతను వేనోళ్ళ చాటుతుంది.
మునుల కష్టసుఖాలకు అక్కడ జంతువులు సైతం ప్రతి స్పందిస్తాయి.
శకుంతల అత్తవారింటికి వెళ్ళిపోతోందని తెలిసి, లేళ్లు తాము మేస్తున్న
గడ్డపరకల్ని నోటిలోనుంచి జారవిడుస్తాయి.
"తండ్రీ! ఈ నిండు గర్భిణి లేడి ప్రసవించిన తరువాత నాకు వర్తమానం పంపించు" అని కణ్యమహర్షిని కోరుతుంది శకుంతల.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!