భాగవతంలోని పోతన ప్రసిద్ధ పద్యం! ‘కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి..’

భాగవతంలోని పోతన ప్రసిద్ధ పద్యం!


‘కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి..’ 

చాలామందికి తెలిసిందే.ఆ తర్వాత కృష్ణుడి స్థితి ఏమైవుంటుందో ఊహించిఓ కార్టూన్ బాపు గారు వేశారు. 

హాస్యం కోసం పురాణేతిహాస ఘట్టాలను ఉపయోగించుకున్న

ఇలాంటి బాపు కార్టూన్లు చాలా ఉన్నాయనుకోండీ.

వీటిలోని చమత్కారం బోధపడక కోపాలు తెచ్చేసుకుని 

నొసలు చిట్లించేవారూ, అపార్థం చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టేవారూ ఉంటూనేవుంటారు.

కానీ కళాకారుడిగా బాపు కుంచెను స్వేచ్ఛగా ఉపయోగించారనీ, సంకుచిత సరిహద్దులేమీ గీసుకోలేదనీ చెప్పటమే నా ఉద్దేశం.

-

తన ఫెయిల్యూర్ సినిమాలపై తనే కార్టూన్లు వేసుకున్నహాస్య చతురత ఆయనకుందని చాలామందికి తెలుసు!

-

Comments

  1. ఇది పోతన భాగవతం లోని పద్యమా?
    తిక్కనది కాదూ!

    ReplyDelete

Post a Comment