కొన్ని నిజాలు.!

-
కొన్ని నిజాలు.!

ఏమతం ?

1440 సంవత్సరములకు పూర్వము ఇస్లాం లేకుండెను.

2018 సంవత్సరములకు పూర్వము క్రైస్తవ మతములేకుండెను.

2500.సంవత్సరములకు పూర్వము బౌధ మతములేకుండెను.

అలెగ్జాండరు భారతదేశం పై దండయాత్ర చేసిన తదుపరి,

సింధూనది పరివాహక ప్రదేశమును "హిందూ " దేశముగా పిలవ బడెను

ఇందు నివసించివారు హిందూవులుగా పిలువబడిరి.

5115 సంవత్సరములకు పూర్వము, ఈ భూభాగము, జంబూద్వీపములో

భరతవర్షములో భరత ఖండముగా మేరుపర్వతమునకు (హిమాలయ) దక్షిణ

దిగ్భాగమందున్నదని భారతీయులచే కీర్తింపబడుచుండెను.

ఆ సమయమందు, ఈ భూభాగమందు వేదోక్త సనాతన సాంప్రదాయ జీవన విధానముండెను.

2085 సంవత్సరములకు పూర్వము, ఈ వేదోక్త సనాతన సాంప్రదాయమునుండి వివిధ శాఖలుత్పన్నమై, స్వతంత్ర మతములుగా ప్రభవిల్లెను.

అవి.... బౌధ్ధ, జైన, చార్వాక, గాణపత్య శాక్తేయ, పాశుపత, వీరశైవ ఇత్యాది స్వతంత్రమతములు, వాటినిర్మాతలు, సాహిత్యము, బలమైన సాంప్రదాయములు, జీవనవిధానము, పరస్పరవిబేధములు, నిందలు, దూషణలు, ఆధిపత్య పోరులు కొనసాగుచుండెను.

మరలా

1194 సంవత్సరములకు పూర్వము, ఆదిశంకరాచార్యులవలన. ఈ విరోధాభాసములు నిర్జింపబడి, కేవలము, వేదోక్త సనాతన ధర్మ ము, జీవనవిధానముగా నిర్దేశింపబడి, సమస్త భారతీయులచేత అంగీకరింప బడి వ్యాప్తి చెందుచూ వచ్చెను.

మహమ్మద్ ఘోరి, ఘజినీల దండయాత్రలవలన భారతదేశమందు తురుష్క మతప్రవేశము జరిగెను, తదాది 1000 సంవత్సరములు మహమ్మదీయుల ఆక్రమణలోఅసంఖ్యాత భారతీయులు, స్వేఛ్ఛతోగాని, బలవంతముగా గాని ఇస్లాం శరణు జొచ్చిరి. తదాదిగా ఈ భారత దేశమందు ఇస్లాం వ్యాప్తిచెందెను.

మరలా

ఆంగ్లేయులు.... మహమ్మదీయ రాజులను, పాలకులను చతుర్విధోపాయములతో నిర్జించి

తమ పాలన కొనసాగించిరి, ఆసమయమందు అనేకములగు ఆమిషలచేత ,భారతీయులు క్రైస్తవులుగా మతమార్పిడికి లోనైరి.

ప్రస్తుతము ఈ భారతదేశమందున్న ముస్లిములుకాని, క్రైస్తవులు గాని ఒకానొక సమయమందు మతమార్పిడికి లోనైనవారే.

ఆంగ్లేయులు, ఈ భారత దేశమునకు కొత్త నామకరణము చేసి. ఇండియా అని పిలుచుట ప్రారంభించిరి.

ఈ పైకారణములచేత,మరలా మతమార్పిడులకు లోనైనభారతీయులు, తిరిగి స్వధర్మమును

స్వీకరించుటలోఆటంకములుండరాదు.

ఈ విధముగా స్వధర్మాను రక్తులైన ప్రజల సంఖ్య ఈ భారతమందధికమైనయడల, కుహనా లౌకికవాదులకు రాజకీయ భవిష్యత్తు సూన్యమగునని,గుబులుతో దిగులు చెంది, నానావిధ ఆటంకములు కలుగచేయుచున్నారు.

జయతు జయ సనాతన ధర్మము .

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!