మాలతీ చందూర్...

మాలతీ చందూర్...

మాలతీ చందూర్ కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1930 లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ,వెంకటేశ్వర్లు.వీరు ఆరుగురు సహోదరులు. అందరికంటే ఆమె చిన్నది. వారు ఉండే ఊరికి, రైల్వేస్టేషనుకు దూరం 13 మైళ్ళు. హనుమాన్‌జంక్షన్‌ కూడా అంతే దూరం. ఆ ఊరు మామిడి పళ్ళకు ప్రసిద్ధి. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నూజివీడు రసాలను బెర్నార్డ్‌షాకు బహుమతిగా ఇచ్చారని ప్రతీతి. ఊరికి వెళ్ళే దారిలో ముందుగా అడివాంజనేయుల గుడి, తరువాత మొగళ్ళ చెరువు, బైరాగుల సత్రం స్వాగతం పలుకుతాయి. ఊర్లో ఉయ్యూరు రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే నేను చదివిన ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. నా బాల్యంలో అధికభాగం నూజివీడులోనే గడిచింది. నేను 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలోనే చదివారు.

ఆ ఊర్లో ఎనిమిదవ తరగతి పూ ర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళారు. అక్కడ వారి మామయ్యగారి(చందూర్) ఇంట్లో ఉండి చదువుకున్నారు. ఏలూరు లోని వల్లూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అప్పుడు చందూర్‌ గారి ద్వారా డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. ఏలూరులో వారున్న ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ ఆమె చూడడం జరిగింది. 1947లో ఆమె, చందూర్‌ గారు జిటి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి మద్రాసు చేరుకున్నారు. సెంట్రల్‌లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జిటాన్‌లో అద్దె ఇంటికి చేరుకున్నారు. 1947 చివర్లో నేను చందూర్‌ గారు వివాహబంధం తో ఒక్కటయ్యారు. మద్రాసు కు వచ్చిన తరువాతే పైవేటు గా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. నేను ఇంత కు మించి పెద్ద చదువులేం చదవలేదు. 1949లో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో రేడియో లో ఆమె రచనలను చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో ఎగ్మూర్‌లో ఉన్న రేడియో స్టేషన్‌కు వెళితే ఒక సాహితీ సభకు వెళ్ళినట్లుండేది. అక్కడే ఆచంట జానకిరాం, బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, రాజమన్నార్‌, మునిమాణిక్యం నరసింహారావు వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు. 1948 నుండి 64 వరకు పురసవాక్కంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ తరువాత ప్రస్తుతమున్న వారి ఇంట్లోకి మారారు. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు. మద్రాసు లో వారికి చాలా మంది మంచి స్నేహితులున్నారు.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం ప్రమదావనం అనే  శీర్షికను రెండు దశాబ్దాలకు పైగానే నడిపింది. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండేవి.  మాలతీ చందూర్ రాసే "జవాబులు" ఆడవారితో పాటు మగవారు కూడా చదివేవారు. మాలతీ చందూర్ 'జవాబులు' శీర్షిక పేజీలను వారపత్రికనుండి చించి, పోగుచేసి, పుస్తకాలుగా బైండింగులు చేసి, చాలామంది అపురూపంగా దాచుకొనేవారు.

తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించింది. ఈమె అనువాదాలు జేన్ ఆస్టిన్ నుండి సమకాలీన అరుంధతీ రాయ్ ల రచనల వరకూ ఉన్నాయి. ఇవి 'పాత కెరటాలు' శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా వృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకొన్నది. 70వ దశకములో కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసిన ఈమె తాను చూసే తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నది. నేర్చుకున్న రెండేళ్లకే అనువాదాలు ప్రారంభించి అనేక తమిళ రచనలను కూడా తెనిగించింది.

మాలతీ చందూర్ ఏలూరులో పుట్టి మద్రాసులో స్థిరపడింది.

2013 ఆగస్టు 21 న చెన్నైలో ఈమె కన్ను మూసారు. చనిపోవడానికి ముందు కొద్ది రోజులు ఈవిడ క్యాన్సర్ వ్యాధి గ్రస్తులయ్యారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!