శ్రీ కృష్ణకర్ణామృతం---లీలాశుకమహర్షి విరచితం.


శ్రీ కృష్ణకర్ణామృతం---లీలాశుకమహర్షి విరచితం.

అద్భుతమైన శ్లోకం :

:కైలాసో నవనీతతతి క్షితిరయం ప్రాక్దగ్ధ్యమృల్లోష్టతి,

క్షీరోదోపి నిపీత దుగ్దతి లసత్ స్మేరే ప్రఫుల్లే ముఖే,

మాతా జీర్ణధియా ధృఢం చకితయా నష్టాస్మి దృష్ఠః కయాః,,

థూ థూ వత్సక జీవ, జీవ చిరమిత్యుక్తో వతాన్నో హరీః.

.

బలరాముడు తల్లి యశోద దగ్గరకు వెళ్ళి తమ్ముడు మన్ను తిన్నాడని చెపాడు. యశొదమ్మ కృష్ణుడిని నోరు తెరవమంది. కృష్ణుడు నోరు తెరిచాడు.

ఇంకేముంది? తల్లికి కైలాస పర్వతం కనపడ్డది.. అది చూసి "అమ్మో, పొద్దున తిన్న వెన్న ముద్ద అరగకుండా అట్లాగే వుంది" అని అనుకున్నది. 

పరిభ్రమిస్తున్న భూగోళం చూసి, నిజమే మన్ను తిన్నాడనుకున్నది.

క్షీరసముద్రం చూసి, అయ్యో పాలు కూడా అరగలేదనుకున్నది. 

ఆ చిరునవ్వులు చిందిస్తున్న ఆ కొంటె కృష్ణుడిని చూసి, 

తల్లి కంగారు పడి పోయి "ఇంకేముంది, ఎవరి దృష్టో తగిలింది" అని 

"థూ, థూ, చిరంజీవ, చిరంజీవ, బిడ్డా" అనుకుంటూ దిష్టి తీయించుకుంటున్న

శ్రీ కృష్ణుడు మనలను కాపాడుకాక.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!