శంతనుడు!

శంతనుడు!

.

మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన సూర్యవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు మరియు కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ట పుత్రుడు.

.

ఒకరోజు శంతనుడు గంగా నదీ పరిసర ప్రాంతాల్లో విహరించుచుండగా ఒక అందమైన కన్యను చూశాడు. ఆమెను వివాహ మాడదలచి ఆమెను అనుమతి కోరాడు. అప్పుడు ఆమె తను ఏమి చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండేటట్లయితే వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేదని షరతు పెట్టింది. అందుకు ఒప్పుకున్న శంతనుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఆమె ఒక పుత్రునికి జన్మనిచ్చింది. ఆమె ఆ శిశువును గంగా గర్భంలో వదలి వేసింది. కానీ ఆమె పెట్టిన షరతును అనుసరించి ఏమీ అడగలేదు. కొంత కాలానికి మరో పుత్రుడు జన్మించాడు. ఆమె ఆ శిశువును కూడా అలాగే గంగార్పణం కావించింది. ఇలా ఏడుగురు పుత్రులను గంగలో వదిలి పెట్టింది. ఎనిమదవ శిశువును కూడా ఆమె అలాగే ముంచివేయడానికి ప్రయత్నించగా కుతూహలం ఆపుకోలేని శంతనుడు ఆమెను ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నించాడు. దాంతో ఆమె షరతుకు భంగం కలిగి ఎనిమదవ శిశువును అలాగే బ్రతకనిచ్చింది. ఆ ఎనిమదవ శిశువే దేవవ్రతుడైనాడు. తర్వాత భీష్ముడిగా పేరుగాంచాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!