మధుబాల Madhubala...

మధుబాల Madhubala
మధుబాల, ముంతాజ్ జహాన్ బేగం దేహ్లావి అనే పేరుతో 14 ఫిబ్రవరి 1933న ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు, వీరు మొహమ్మద్జాయ్ (బరక్జాయ్‌గా కూడా పిలువబడుతుంది) రాజవంశ శాఖకు చెందిన కాబూల్ యొక్క నవాబి కుటుంబ సభ్యులు, ఈమె తాతలు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం నుండి భారతదేశానికి బహిష్కరింపబడ్డారు. సాంప్రదాయ ముస్లిం దంపతుల పదకొండు మంది సంతానంలో ఈమె ఐదవవారు. మధుబాల తండ్రి అతుల్లా ఖాన్ పెషావర్‌లోని ఇంపీరియల్ టొబాకో కంపెనీలో తన ఉద్యోగాన్ని కోల్పోయినతరువాత తన కుటుంబాన్ని ముంబైకి మార్చారు. యువ ముంతాజ్ తొమ్మిది సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు.
ముంతాజ్ యొక్క మొదటి చిత్రం బసంత్ (1942) బాక్స్-ఆఫీస్ వద్ద విజయవంతమైంది . ఆమె దానిలో ప్రసిద్ధ నటి ముంతాజ్ శాంతి యొక్క కుమార్తెగా నటించారు. బాలనటిగా ఆమె అనేక చిత్రాలలో నటించడాన్ని కొనసాగించారు. నటీమణి దేవికా రాణి ఆమె నటనకు మరియు సామర్ధ్యానికి ముగ్దులై ఆమెకు మధుబాల అనే పేరు పెట్టుకోమని సలహా ఇచ్చారు మధుబాల త్వరగానే ఒక విశ్వసనీయమైన వృత్తిపరమైన నటిగా కీర్తిని సంపాదించుకున్నారు. యుక్తవయసులో ప్రవేశించేనాటికి, ఆమెకు ప్రధాన పాత్రల కొరకు శిక్షణ ఇవ్వబడింది.
నిర్మాత కిదార్ శర్మ ఆమెను రాజ్ కపూర్‌కి ప్రతిగా నీల్ కమల్ (1947) చిత్రంలో నటింపచేయడంతో ఆమెకు మొదటి ప్రధాన పాత్ర లభించింది . ప్రధాన పాత్ర ధరించినపుడు ఆమె వయసు పద్నాలుగు సంవత్సరాలు. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు, అయితే ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది.
తరువాత రెండు సంవత్సరాలలో, ఆమె ఒక ఆకర్షణీయమైన అందగత్తెగా ఎదిగారు. బోంబే టాకీస్ చిత్రం మహల్ 1949లో ప్రధాన పాత్రను పోషించిన తరువాత, మధుబాల అత్యంత ప్రజాదరణ పొందారు. ఆ సమయంలో ఆమె వయసు 16 సంవత్సరాలే అయినప్పటికీ, ఆమె సున్నిత మరియు నైపుణ్యంతో కూడిన నటన ఆమె ప్రసిద్ధ సహ-నటుడు అశోక్ కుమార్‌ను ఆకర్షించింది. ఈ చిత్రం మరియు దానిలోని ఆయేగా ఆనేవాలా అనే పాట ఇద్దరు సూపర్ స్టార్ల ప్రవేశాన్ని సూచించింది: మధుబాల మరియు నేపధ్య గాయని లతా మంగేష్కర్.
1950లో రక్తంతో దగ్గిన తరువాత మధుబాల గుండెకు సమస్య ఉన్నట్లు గుర్తించబడింది. ఆమెకు వెంట్రిక్యులర్ సెప్టల్ లోపం, సాధారణంగా "గుండెలో రంధ్రం"గా పిలువబడే లోపం ఉన్నట్లు కనుగొనబడింది. ఆ సమయంలో, గుండె శస్త్రచికిత్స అంత ఎక్కువగా అందుబాటులో లేదు.
మధుబాల అనేక సంవత్సరాల పాటు చిత్రపరిశ్రమ నుండి తన జబ్బుని దాచిపెట్టారు, కానీ 1954లోని ఒక సంఘటన ప్రసార సాధనాలచే విస్తృతంగా తెలియచేయబడింది: S.S. వాసన్ చిత్రం బహుత్ దిన్ హుయే కొరకు మద్రాస్‌లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె సెట్‌పై రక్తం కక్కుకున్నారు. ఆమె తిరిగి కోలుకునేవరకు వాసన్ మరియు అతని భార్య ఆమెను సంరక్షించారు. ఆమె తన పనిని కొనసాగించి తననుతాను A-గ్రేడ్ నటిగా నిరూపించుకున్నారు.
ఆమె ఆరోగ్య సమస్య కారణంగా మధుబాల కుటుంబం ఆమె పట్ల అత్యంత రక్షణతో ఉండేది. స్టూడియోలలో చిత్రనిర్మాణం జరిగే సమయంలో, ఆమె ఇంటి-నుండి తయారయి వచ్చిన ఆహారాన్ని మాత్రమే తినేవారు, అంటురోగాల బారిన పడే అవకాశాలను తగ్గించడానికి ఒక బావి నీటిని మాత్రమే వాడేవారు. కానీ ఆమె పరిస్థితి పూర్తిగా వికటించి, 1969లో 36 సంవత్సరాల వయసులో చనిపోయారు. జబ్బుతో ఉన్నప్పటికీ, 1950లలోని ఎక్కువ చిత్రాలలో మధుబాల విజయవంతంగా నటించారు. ఒక నటిగా, మధుబాల పరిశ్రమలో ఉన్నత స్థానాన్ని అధిరోహించారు. ఆమె సహనటులు ఆకాలంలో అత్యంత ప్రసిద్ధి చెందినవారు: అశోక్ కుమార్, రాజ్ కపూర్, రెహ్మాన్, ప్రదీప్ కుమార్, షమ్మీ కపూర్, దిలీప్ కుమార్ , సునీల్ దత్ మరియు దేవ్ ఆనంద్. మధుబాల ఆ కాలంలోని అనేక ప్రసిద్ధ ప్రధాన నటీమణుల సరసన కూడా నటించారు, వీరిలో కామినీ కౌశల్, సురయ్య, గీతా బాలి, నళిని జయవంత్ మరియు నిమ్మి ఉన్నారు. ఆమెతో పనిచేసిన దర్శకులు అత్యంత విస్తృతి కలిగి గౌరవింపబడినవారిలో కొందరు: మెహబూబ్ ఖాన్ (అమర్ ), గురు దత్ (Mr. & Mrs. ' 55), కమల్ అమ్రోహి (మహల్) మరియు K. ఆసిఫ్ (ముఘల్-ఏ-ఆజం) . 1950లలో, ఆ సమయంలో తీయబడిన అన్నిరకాల చిత్రాలలో నటించి, మధుబాల తనను తాను వైవిధ్యమైన నటిగా నిరూపించుకున్నారు. బాదల్ (1951) చిత్రంలో ఆమె మూస ధోరణిలో ఉత్తమ స్త్రీ పాత్ర ధరించారు మరియు తరువాత వచ్చిన తరానా (1951)లో ఎదురులేని అందమైన పల్లెటూరి పడుచుగా నటించారు. సాంప్రదాయ ఆదర్శ భారత స్త్రీగా ఆమె సంగ్ దిల్ (1952)లో ఒదిగిపోయారు మరియు
హౌరా బ్రిడ్జ్ చిత్రంలో అశోక్ కుమార్ కు ప్రతిగా మధుబాల అసాధారణమైన ఆంగ్లో-ఇండియన్ క్యాబరే గాయనిగా నటించారు. ఆ చిత్రం కొరకు ఆషా భోస్లే నేపధ్యగానం చేసిన పాట ఆయె మెహెర్బాన్ , శ్రోతలలో బాగా ప్రజాదరణ పొందింది. హౌరా బ్రిడ్జ్ తరువాత ఫాగున్ ‌లో భరత్ భూషణ్‌కు ప్రతిగా, కాలాపానీ లో దేవ్ ఆనంద్‌కు, శాశ్వత విజయాన్ని పొందిన చల్తీ కా నామ్ గాడీ లో ఆమె కాబోయే భర్త కిషోర్ కుమార్‌తోనూ మరియు బర్సాత్ కి రాత్ (1960)లో మరలా భరత్ భూషణ్‌కు ప్రతిగా నటించారు. 1960లో ఆమె విజయాలను ధృఢపరచుకున్నారు, మరియు ఆమె సూపర్-స్టార్ స్థాయి ఆమెకు కావ్యసంబంధ భారీ-బడ్జెట్ చారిత్రకం, ముఘల్-ఏ-ఆజం తో స్థిరపడింది. ఈ చిత్రం ఆమె వృత్తి జీవితంలో మణిగా మరియు ఆ దశాబ్ద చిత్రనిర్మాణానికే మణిగా భావించబడింది.
మధుబాల, నటుడు మరియు తరచు తన సహ నటుడు అయిన దిలీప్ కుమార్ తో దీర్ఘకాలం సంబంధాన్ని కలిగిఉన్నారు ,తరానా (1951) చిత్రీకరణ సమయంలో వారి తెరవెనుక సంబంధం ప్రారంభమైంది. వారు తమ సంబంధాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు..దిలీప్ కుమార్‌తో మధుబాల ప్రేమకథ ఐదు సంవత్సరాల పాటు 1951 మరియు 1956ల మధ్య నడిచింది. వారి సంబంధం అధిక వివాదాస్పదమైన మరియు విస్తృతంగా ప్రచురించబడ్డ కోర్ట్ కేసుతో ముగిసింది.అప్పటి నుండి మధుబాల మరియు దిలీప్ కుమార్ విడిపోయారు.
ఆమె, తన భర్త, నటుడు మరియు నేపధ్యగాయకుడు అయిన కిషోర్ కుమార్‌ను చల్తీ కా నామ్ గాడీ (1958) మరియు ఝుమ్రూ (1961)ల చిత్రీకరణ సమయంలో కలుసుకున్నారు. అప్పటికీ ఆయనకు బెంగాలీ గాయని మరియు నటి రుమా గుహా టాకుర్తాతో వివాహమైంది. ఆయన విడాకులు తీసుకున్న తరువాత, కిషోర్ కుమార్ హిందూ మరియు మధుబాల ముస్లిం కావడంతో, 1960లో వారు పౌరవివాహం చేసుకున్నారు. దానికి హాజరు కావడానికి ఆయన తల్లిదండ్రులు నిరాకరించారు. కిషోర్ కుమార్ తల్లిదండ్రులను సంతృప్తి పరచడానికి ఈ జంట హిందూ వేడుకను కూడా జరుపుకున్నారు, కానీ మధుబాల ఎప్పుడూ అతని నిజమైన భార్య కాలేకపోయారు. కుమార్ గృహంలో కలతల కారణంగా వివాహమైన నెలరోజుల్లోనే ఆమె తన బాంద్రా భవంతికి తిరిగివచ్చారు. మధుబాల శేషజీవితమంతా వారి వైవాహిక జీవితం విపరీతమైన ఒత్తిడితోనే కొనసాగింది.
మధుబాల యొక్క జబ్బుని గురించి తెలియని దర్శకుడు K. ఆసిఫ్, సుదీర్ఘ మరియు విసుగుకలిగించే చిత్రీకరణ సమయాలను కోరారు, ముసుగు వేసిన విగ్రహం కొరకు ఊపిరాడని అలంకరణతో చెమటలు పట్టే స్టూడియో దీపాల క్రింద భంగిమలో ఉండటం వలన లేదా భారీ గొలుసులతో నిర్బంధంలో ఉండటం కారణంగా ఆమె విపరీతమైన శారీరక శ్రమకు లోనయ్యారు. 1951 నుండి 1959 వరకు ముఘల్-ఏ-ఆజం కొరకు మధుబాల తన ఉత్తమ ప్రయత్నాలను అందించారు. 1956 అనంతరం మరియు దిలీప్ కుమార్ నుండి విడిపోయిన తరువాత, ఈ చిత్రం యొక్క మిగిలిన సన్నిహిత ప్రేమ దృశ్యాలు మధుబాల మరియు ఆమె ఇప్పటి వేరుపడిన సహ-నటుడికి మధ్య తీవ్ర ఒత్తిడితో చిత్రీకరించబడ్డాయి. తరువాత కాలంలో ఆమె ఆరోగ్యం మందగించడం మరియు అకాల మరణాలకు ఈ మానసిక మరియు శారీరక అనుభవ భారం ప్రధానకారణంగా విస్తృతంగా భావించబడింది.
5 ఆగష్టు 1960న విడుదలైన ముఘల్-ఏ-ఆజం ఆ సమయంలో అత్యధిక వసూళ్లను చేసిన చిత్రంగా నిలిచింది, ఈ రికార్దు 1975లో షోలే చిత్రం విడుదల అయ్యేవరకు కొనసాగింది.
1960లో, మధుబాల పరిస్థితి దిగజారడంతో ఆమె చికిత్స కొరకు లండన్ వెళ్లారు. సంక్లిష్టమైన హృదయ శస్త్రచికిత్స దాని శైశవదశలో ఉండి ఆమెకు నయం కావడానికి కొంత ఆశను అందించింది. పరీక్షించిన తరువాత వైద్యులు శస్త్రచికిత్స చేయడానికి నిరాకరించి, ఈ ప్రక్రియ వలన జీవించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఒప్పించారు ఆమె విశ్రాంతి తీసుకోవాలని మరియు అతిగా ఒత్తిడికి గురవరాదని సలహాఇచ్చారు, ఆమె మరొక సంవత్సరం బ్రతుకుతుందని ఊహించారు. తన మరణం ఆసన్నమైందని తెలుసుకున్న మధుబాల, భారతదేశానికి తిరిగివచ్చారు, కానీ మరొక 9 సంవత్సరాలు జీవించడం ద్వారా అంచనాలను అధిగమించారు. మధుబాల జబ్బుకు లోనై 23 ఫిబ్రవరి 1969న, తన 36వ పుట్టినరోజు జరిగిన కొద్దికాలానికే మరణించారు. ఆమె తన కుటుంబ సభ్యులు మరియు భర్త కిషోర్ కుమార్‌చే శాంటా క్రుజ్ స్మశానవాటికలో తన డైరీతోపాటు ఖననం చేయబడ్డారు జుహు/శాంటా క్రుజ్ ముస్లిం స్మశాన వాటికలోని మధుబాల సమాధి స్వచ్ఛమైన పాలరాయితో చెక్కబడింది మరియు కురాన్ నుండి ఆయత్ లు వాటితోపాటు శ్లోకాలు ఆమెకు అంకితం చేయబడ్డాయి. ఆమె చనిపోయిన 35 సంవత్సరాల తరువాత, 2004లో ముఘల్-ఏ-ఆజం యొక్క కలర్ విడుదలైంది. 2008లో మధుబాల జ్ఞాపకార్ధం ఒక భారతీయ తపాలా బిళ్ళ విడుదల చేయబడింది. మధుబాల సోదరి చంచల్ కూడా నటించారు.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!