రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు?


రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు?

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక

నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ

వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక

పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో

రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ

ఆయన్ను ఆపి "ఏం జరిగింది? ఎందుకలా

భయపడుతున్నారు?" అని అడిగారు.

అందుకాయన... "అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో

మనుషుల్ని చంపేది ఉంది." వాళ్ళిద్దరూ

భయంతో… "అంటే అక్కడ పులి ఉందా?" అని

అడిగారు.

"కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని

మూలికల కోసం తవ్వుతుండగా అది

బయటపడింది." అన్నాడాయన. "ఇంతకీ ఏమిటది?"

అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. "బంగారు

నాణేల గుట్ట" అన్నాడు సన్యాసి. వాళ్ళిద్దరూ

సంతోషంగా "ఎక్కడ?" అని అడిగారు.

"అదిగో ఆ పొదల్లోనే" అని వేలు చూపించి తన దారిన

పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు

పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే

అక్కడ బంగారు నాణేలు కనిపించాయి. "ఈ సన్యాసి

ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని

పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?"

అన్నాడొక మిత్రుడు.

"అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం

చేయాలో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని

మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం

ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం.

మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం."

అన్నాడు మరో మిత్రుడు.

అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా

ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా మొదటి

వాడు ఇలా అనుకున్నాడు. "ఛ… ఈ రోజు నేను

ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది?

ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం

బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా

మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది.

దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే

బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి

చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం

అంతా నేనే తీసుకోవచ్చు." అలా అనుకుని కత్తిని

నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన

ఇలాఉంది… "వాడికి సగం భాగం ఎందుకివ్వాలి?

మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే

నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ

వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు.

ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి

ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను

తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని

వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా

బంగారమంతా నేనే తీసుకోవచ్చు" అనుకున్నాడు.

అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం

నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.

అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న

రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో

పొడిచి చంపేశాడు.

"పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు

పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను."

అనుకుని

ఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని

తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత

వాయువుల్లో కలిసిపోయాయి. "సన్యాసి మాటలు

ఎంత నిజమో కదా" అనుకున్నాడు చివరి క్షణాల్లో.

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు?

అంటే… తోబుట్టువుల మధ్యం వైరం

పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య

చిచ్చుబెడతాను, ఇవరికి స్నేహితులను కూడా

దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని

పెద్దల నానుడి. కాబట్టి ఆ రూపాయి విషయంలో

జాగ్రత…

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!