సిద్దేంద్రయోగి...వారి గురువు నారాయణతీర్థులు"!


.

సిద్దేంద్రయోగి...వారి గురువు నారాయణతీర్థులు"!

.

నారాయణ తీర్థుల వారికీ దృష్టిదోషం ఉండేది... రోజూ రాత్రిళ్ళు భోజనాలయ్యాక....వసారాలో పడుకునీ కళ్ళుమూసుకుని 

తరంగాలు పాడుకునేవారు.

బాలకృఘ్ణడొచ్చి.....తీర్థులవారి బొజ్జమీదెక్కి....తాండవం చేసేవాడు.

తాండవ క్రిఘ్ణడి నృత్యం రోజూ చూస్తున్న సిద్దయ్య...ఓ రోజు అడిగాడు. "గురూ గారు రోజూ బాలకృఘ్ణడు మీ బొజ్జమీద తాండవం చేస్తోంటే మీకు పొట్టనొప్పిగా ఉండట్లేదూ?"

"బాలకృఘ్ణడి తాండవమా...ఎప్పుడ్రా..."

"అయ్యో! రాత్రిళ్ళు....మీరు నిద్రపోయే ముందు తరంగాలు అంటారు గదా....అప్పుడు బాలకృఘ్ణడు తాండవం చేస్తాడు...నేను రోజూ చూస్తున్నాగా"!

"ఎంత అదృష్టవంతుడివిరా...గుడ్డిపీనుగుని నాకు కనపడ్డేం!" అని కళ్ళు తుడుచుకునీ

"ఒరే...ఈసారి కృఘ్ణడు కనబడ్తే మనిద్దరికీ జన్మరాహిత్యం ఎప్పుడో కనుక్కో..."

"ఓ......అలాగే"అన్నాడు సిద్దప్ప...

మర్నాడు రాత్రి బాలకృఘ్ణడు కనపడగానే దణ్ణం పెట్టీ "జగద్గురూ....మా గురూగారికీ, నాకూ మోక్షం ఎప్పుడు?" అన్నాడు.

"నీకు ఈ జన్మలోనే...(నా దర్శనం అయ్యిందిగా.....!)

మీ గురూగారికి మాత్రం మరో జన్ముంది!!" అన్నాడు. మురళి మనోహరంగా మోగింది...

అంచేతే సిద్దేంద్రయోగి...యక్షగానంని ఆంధ్ర దేశం అంతటా ప్రదర్శించీ...పుణ్యలోకాల కెళ్ళారు.

ఆ తర్వాత...వారి గురువు నారాయణతీర్థులు...

.

కృష్ణలీలా తరంగాలు’

.

.కృష్ణంకలయ సఖీ సుందరం

బాలకృష్ణం కలయ సఖీ సుందరం

కృష్ణం గత విషయ తృష్ణం....

.

అవి రాసినాయన `నారాయణ తీర్థులు’ .!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!