కార్తీక సోమవార వ్రతం !

కార్తీక సోమవార వ్రతం !

ఈ కార్తీకమాసంలో శివునికి ఇష్టమైన కార్తీక సోమవార వ్రతం. ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. 

కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజయినా సరే స్నాన, జపాడులను ఆచరించినవారు వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారు. 

ఈ సోమవారా వ్రాత విధి 6 రకాలుగా ఉంది.’’

1. ఉపవాసం : చేయగలిగిన వారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనంగా ఉంది, సాయకాలం శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనానంతరం తులసితీర్థం మాత్రమే సేవించాలి.

2. ఏకభక్తం : సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నానజపాదులు యథావిధిగా ముగించి, మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్ధమో తులసి తీర్ధమో తీసుకోవాలి.

3. నక్తం : పగలంతా ఉపవాసం ఉంది, రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం కానీ తీసుకోవాలి.

4. అయాచితం : భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి భోజనం పెడితే మాత్రమే భోజనం చేయాలి. దీన్నే అయాచితం అంటారు.

5. స్నానం : పైన సూచించిన వాటికి వేటికీ శక్తి లేనివారు సమంత్రక స్నానజపాదులు చేసినట్లయితే సరిపోతుంది.

6. తిలాపాపం : మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది.

పై ఆరు పద్ధతుల్లో దేవిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ, తెలిసి ఉండి కూడా ఏ ఒక్క పద్ధతినీ ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుమ్బీపాక రౌరవాది నరకాలని పొందుతారని ఆర్షవాక్యం. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనాధలు, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారు. కార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడూ కూడా పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భాగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు.

సోమవార వ్రతాన్ని చేసేవారు నమక చమక శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి.

ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెప్తాను, వినండి.

నిష్టురి కథ :

పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి ''నిష్టురి'' అనే కూతురు ఉండేది. ఆమె అందంగా, ఆరోగ్యంగా, విలాసంగా ఉండేది. అయితే సద్గుణాలు మాత్రం లేవు. అనేక దుష్ట గుణాలతో గయ్యాళిగా, కాముకురాలిగా ఉండే ఈ నిష్టురిని ఆమె చెడ్డ గుణాలకారణంగా ''కర్కశ'' అని పిలిచేవారు.

నిష్టురి తండ్రి తన బాధ్యత ప్రకారం కర్కాషను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వ్యక్తితో పెళ్ళి జరిపించి, చేతులు దులుపుకున్నాడు. మిత్రశర్మ చదువు, సదాచారాలు ఉన్నవాడు. సద్గుణాలు ఉన్నాయి. సరసమూ తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడు కావడాన్ని కర్కశ ఆడింది ఆటగా, పాడింది పాటగా కొనసాగింది. పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ, కొడుతూ ఉండేది. అయినప్పటికీ భార్యపై మనసు చంపుకోలేకపోయాడు. పైగా పరువు పోతుందని ఆలోచించాడు. కర్కశ పెట్టే బాధలన్నీ భరించాడే తప్ప, ఆమెను ఎన్నడూ శిక్షించలేదు. ఆమె ఆఖరికి పర పురుషులతో సంబంధం పెట్టుకుని భర్తను, అతని తల్లితండ్రులను హింస పెట్టేది.

ఒకరోజు ఆమెతో నేస్తం చేసిన ఒక దుర్మార్గుడు ''నీ భర్త కారణంగా మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం'' అంటూ రెచ్చగొట్టగా ఆ రాత్రి కర్కశ భర్త నిద్రిస్తుండగా బండరాతితో తల పగలగొట్టి చంపింది. శవాన్ని తానే మోసుకుని వెళ్ళి ఒక పాడుబడ్డ బావిలో వేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె దుర్గుణాలు, దుష్ట స్నేహాలు ఎక్కువ కనుక అత్తమామలు ఆమెను ఏమీ అనకుండా, తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.

అంతటితో కర్కశ మరీ రెచ్చిపోయింది. కామంతో కన్నుమిన్ను కానక ఎందరో పురుషులతో సంబంధం పెట్టుకుంది. పైగా దాన్నో వ్యాపారం కింద చేయసాగింది. చివరికి ఆమె జబ్బులపాలయింది. పూవు లాంటి శరీరం పుళ్ళతో జుగుప్సాకరంగా తయారైంది. విటులు అసహ్యంతో రావడం తగ్గించారు. సంపాదన పోయింది. అప్పటిదాకా భయపడినవారంతా ఆమెను అసహ్యించుకోసాగారు. ఆ హీనురాలికి జబ్బులే తప్ప బిడ్డలు పుట్టలేదు. చివరికి తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ఒంటినిండా రోగాలతో వీధిలో దిక్కులేని చావు తెచ్చుకుంది. యమదూతలు ఆమెను నరకానికి తీసికెళ్ళి శిక్షించారు.

భర్తను హింసించినందుకు కర్కశకు నరకం :

భర్తను విస్మరించి, పర పురుషులను చేరిన కర్కశ పాపాలకు ఆమె మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలి. ముళ్ళ గదలతో తల పగిలేట్లు కొట్టారు. రాతిమీద వేసి చితక్కొట్టారు. సీసం చెవుల్లో వేశారు. కుంభీపాక నరకానికి పంపారు. ఆమె చేసినా పాపాలకు గానూ ముందు పది తరాలు, వెనుక పది తరాలు, ఆమెతో కలిసి 21 తరాలవాళ్ళను కుంభీపాక నరకానికి పంపారు. ఆ తర్వాత ఆమె 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వ సారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది.

---

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!