శ్రీకృష్ణ శతకం.!........( 26 /5/15)... (శ్రీ నరసింహ కవి.)

.


శ్రీకృష్ణ శతకం.!........( 26 /5/15)... (శ్రీ నరసింహ కవి.)

.

అందఱు సురలును దనుజులు


పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా


నందముగ కూర్మరూపున


మందరగిరి యెత్తితౌర మాధవ! కృష్ణా!

.


ప్రతిపదార్థం: మాధవా! అంటే మౌనం, ధ్యానం, యోగం అనే మూడు మార్గాలద్వారా భక్తులను అనుగ్రహించేవాడా లేదా లక్ష్మీదేవి భర్తయైనవాడా; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; సురలును అంటే దేవతలు; దనుజులు అంటే రాక్షసులు; అందరు అంటే వీరందరూ; పొందుగ అంటే ఒకరితో ఒకరు కలిసి; క్షీర + అబ్ధిన్ అంటే అంటే పాలసముద్రాన్ని; తఱవన్ అంటే కవ్వంతో చిలుకగాచిలుకగా;పొలుపునన్ అంటే నేర్పుతో; నీవు + ఆనందముగ అంటే సంతోషం కలిగేటట్లు నువ్వు; కూర్మరూపునన్ అంటే తాబేలు ఆకారంలో; మందరగిరి అంటే కవ్వంగా ఉన్న మందరగిరి అనే పేరుగల పర్వతాన్ని; ఎత్తితివి + ఔర అంటే పైకి ఎత్తటం ఎంత ఆశ్చర్యం!

.


భావం: లక్ష్మీదేవి భర్తవైన ఓ శ్రీకృష్ణా! దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి స్నేహంగా పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో నువ్వు తాబేలు రూపం ధరించి, ఎంతో చాకచక్యంగా కవ్వంగా ఉన్న మందరపర్వతాన్ని ఎత్తావు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం. 

.


విష్ణుమూర్తి అవతారాలలో రెండవది కూర్మావతారం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు. అందుకు వాసుకి అనే పామును తాడుగానూ, మందరగిరి అనే పర్వతాన్ని కవ్వంగానూ ఎంచుకున్నారు. ఆ కవ్వంతో సముద్రాన్ని చిలుకుతుంటే అది నెమ్మదిగా కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణుమూర్తి కూర్మ (తాబేలు) రూపంలో వచ్చి మందరగిరిని తన వీపు మీద మోశాడు. ఆ సన్నివేశాన్ని కవి ఈపద్యంలో వివరించాడు.

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!