మహాకవి ధూర్జటి .... శ్రీ కృష్ణ దేవరాయలు.!

 .

మహాకవి ధూర్జటి .... శ్రీ కృష్ణ దేవరాయలు.!
.
మహాకవి ధూర్జటి సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయల వారి ఆస్థానకవి గా మన్నన లందినా తన కావ్యాలను మాత్రం శ్రీకాళహస్తీశ్వరునకే అంకితం చేశాడు. వైష్ణవ మతాన్ని స్వీకరించి , ఆముక్తమాల్యద వంటి ఆళ్వారు వృత్తాంతాన్ని కావ్యంగా వ్రాసిన శ్రీ కృష్ణ దేవరాయలు వీరశైవుడైన ధూర్జటిని తన ఆస్థానం లో పోషించడం శ్రీ రాయల వారి పరమత సహనాననికి ప్రతీక యని కొందరు వ్రాశారు.
. ...

విమర్శకులు భావిస్తున్నట్లుగా శ్రీ రాయల వారి మరణానంతరం కూడ ధూర్జటి జీవించి యుండవచ్చు. జీవనాన్ని కొనసాగించడానికి రాజులను ఆశ్రయించి , వారి అభిరుచుల కనుగుణం గా తానుండలేక ఇడుముల పాలయినట్లు గాను మనం భావించవచ్చు. కవి వ్రాసిన కవిత్వాన్ని తనకు అంకితం చేయకుండా ఉన్నా అతన్ని పోషించడానికి రాజులు అందరూ శ్రీ రాయలవారి అంత ఉదారులు ఉండరు కదా . అదే మహాకవి కి ఇబ్బందిని కల్గించి ఉంటుంది. మహాకవి తీసుకున్న నిర్ణయం కూడ మహాదేవునికి కాక తన కవిత్వం మరొకరిపై చెప్పననే మహాకవి తీసుకున్న నిర్ణయం కూడ రాజులకు కంటకమై , కవికి జీవనవ్యయానికి ఇబ్బంది కల్గించి ఉండవచ్చు. నీకుంగాని కవిత్వమెవ్వరికి ........ (113 ) పద్యమే అందుకు ఉదాహరణ.
.
అందుకే మనకు ఈ శతకం లో ఆత్మనివేదన తో పాటు రాజాశ్రయ తిరస్కారము లేక రాజనింద అనేది ప్రధానాంశం గా కన్పిస్తోంది.
.
మనకు లభించని కొందరు మహాకవుల చరిత్రల్లో ధూర్జటి జీవితం కూడ ఒకటి. ఈయన అష్టదిగ్గజాలలో ఒకరు గా ఉన్నట్లు ( ? ) చెప్పబడుతోంది కాని తల్లిదండ్రులను గురించి కాని , నివాసప్రాంతాన్ని గురించి కాని స్పష్టంగా తెలియడం లేదు. కాళహస్తి లో నివసించేవాడని . ఈయన కోరిక మేరకే ఒకటి రెండు సార్లు వైష్ణవుడైన శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాళహస్తిని దర్శించి ఉంటారని కొందరు వ్రాశారు.
.
భక్తి శతకాలలో సహజం గా కన్పించే ఆత్మ నివేదన , ప్రస్తుతి తో పాటు ఈ శతకం లో సంసార నిరసనము , రాజతిరస్కారము కూడ సమాన ప్రాతినిధ్యాన్ని పొందాయి. సూక్ష్ణంగా యోచిస్తే కవిసార్వభౌముడు శ్రీనాథుని జీవితానికి, మహాకవి ధూర్జటి జీవితానికి పోలికలున్నాయేమో ననిపిస్తోంది. వయసు లో భోగలాలసత తో విలాస జీవితాన్ని గడిపిన ధూర్జటిని చివరి రోజుల్లో కుటుంబ ఖర్చులు , ఒత్తిళ్లు ఇబ్బందికి గురిచేశాయి. కూతుళ్లు , పెళ్ళిళ్లు ,ఇచ్చిపుచ్చుకోవడాలు వీటికి అవసరమైన ధనాన్ని కూర్చుకోలేక పడిన ఇబ్బందులు , ఇవన్నీ కవిపై ప్రభావాన్ని చూపాయి. ” ఆలంచు న్మెడగట్టి ........ ఇచ్చిపుచ్చుకొను సంబంధంబు గావించి ...” (36 ) వంటి పద్యాలు ఇందుకు ఉదాహరణలు . నమ్ముకున్న ఈశ్వరుడు అవసరానికి తనను ఆదుకోవడం లేదనే ఉక్రోషం కూడ అప్పుడప్పుడూ కవిలో కన్పిస్తుంది.
.
మంచి బంగారానికి ఒరిపిడి ,పరమ భక్తునికి పరీక్ష లు తప్పవు కదా.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!