నీ పాద కమల సేవ .!

నీ పాద కమల సేవ .!

నీ పాద కమల సేవయు , 

నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం

తాపార భూత దయయను ,

తాపస మందార నాకు దయసేయగదే

.

సుదాముడు మధురానగరంలో మాలాకారుడు అంటే పూలు అమ్ముకునే వాడు .

మధురా నగరిలో ప్రవేశించిన బలరామ కృష్ణులు సుదాముని ఇంటికి వెళ్ళారు .

వారిని చూచిన వెంటనే తత్తరపాటుతో తన ఆసనాన్నుండి లేచి నమస్కారం చేసాడు సుదాముడు . అర్ఘ్య పాద్యాలను , తాంబూలాలను , పూలు , గంధము మొదలైన వస్తువులను ఆనందభరితుడై వారికి ఇచ్చాడు . పరిమళాలు వెదజల్లే పూలమాలలతో వారి గళసీమను అలంకరించాడు .

.

మీ రాకతో నా ఇల్లు పావనమయ్యింది , తపస్సు పండింది , నా ఇల్లు సిరి సంపదలతో నిండింది , నా కోరికలన్నీ తీరినాయి . నేను ఏ పనులు చేయాలి ? అని వారితో పలికాడు . సంతోషించిన బలరామకృష్ణులు ఏం కావాలో కోరుకొమ్మన్నారు .

.

ఆ సందర్భంలో సుదాముని నోటినుండి వచ్చిన మాటలు పద్య రూపంలో మన కందించాడు పోతన్న . పద్యానికి అర్థం చెప్పదం అవసరం లేదనుకుంటాను . సులభంగా లేదూ ?

భగవంతుడు కనబడి నీకేమి కావాలని అడుగుతే , అడగడానికి ఏమీ ఉండదు . ఆ ముగ్ధమోహన మూర్తి దర్శనంతో కోరికలన్నీ నశిస్తాయి . ఆ మహాత్ముని పాదాలకు సేవ చెయ్యాలనే కోరిక తప్ప మరేమీ మిగలదని ఈ పద్యం చెబుతుంది .

Comments

  1. చాలా బాగా అర్ధమయ్యెలా చెప్పారు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!