యమునితో ముఖాముఖీ.!

.

యమునితో ముఖాముఖీ.!


.

సాందీపని కృష్ణునికి గాయత్రీ మంత్రము ఉపదేశించినపుడు

 ఆయనకు చిత్రమైన అనుభవం కలిగినది. గాయత్రీదేవికే గాయత్రి ఉపదేశిస్తున్న భావన. అపుడు కృష్ణుడెవరో ఆయనకు పూర్తిగా తెలిసినది. సామాన్యుల కంటే తక్కువ సమయంలోనే వారు విద్యలన్నీ నేర్చుకున్నారు.

 చదువు పూర్తి చేసుకొని ఆయనను గురుదక్షిణ ఏమికావాలని అడిగారు. వారి శక్తి తెలిసిన గురువు తగిన కోరిక చెప్పారు. కొన్నిసంవత్సరాల క్రితం చనిపోయిన వారి పుత్రుని తిరిగి తెమ్మని అడిగారు. అదొక అద్భుత ఘట్టం. 

.


మనుష్యులు తప్పించుకొనలేనిది మృత్యువు., ఆత్మీయులు దూరమైనప్పుడు కలిగే దుఃఖాన్ని ప్రతివారూ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసినదే. 

అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివుని అనుగ్రహంతో చిరంజీవి అయ్యాడు.

 సావిత్రి యమునితో వాదించి భర్త సత్యవంతుడి ప్రాణాలు తిరిగి తీసుకురాగలిగినది. నచికేతుడు యమునితో వాదించి యముని వద్దనుండి తిరిగి రాగలిగాడు. 

కృష్ణుడు, బలరాముడు యముని వద్దకి వెళ్ళి సాందీపని పుత్రుని ప్రాణాలు తీసుకొని వచ్చారు.  కృష్ణుడు ఉత్తరాగర్భంలోని మృత శిశువుని బ్రతికేస్తేనే పరీక్షిత్తు బ్రతికి బట్టకట్టాడు.

 ఇది ఎలా సాధ్యం? దేవుళ్ళు కాబట్టి అనే సమాధానం, కల్పిత కథ కాబట్టి అనేసమాధానం పొసగవు.


శ్రీ కృష్ణుడు తనగురువు కొరకై ఏ యోగి, ఏ తపస్వి చేయని యోగ ప్రక్రియ చేసినాడు. గురుదక్షిణగా తన మృత పుత్రుని తీసుకు రావలేనని సాందీపని ఆయనను కోరెను. 

కృష్ణుడు వెంటనే ధ్యాన ముద్రలో స్వాధిష్ఠానమునకు వెళ్ళినాడు.

 వెంటనే అతని దివ్య శరీరము యమలోకములో ప్రత్యక్ష మైనది

. యముడు ఏమికావాలని అడుగగా కొన్ని సంవత్సరముల క్రితం చనిపోయిన గురుపుత్రుని జీవాత్మ కావలెనని అడిగి తీసుకొని భూలోకమునకు వచ్చినాడు.

 అప్పటి వయసు ఎంత ఉండునో, అట్టి శరీరమును యోగశక్తిచే సృష్టించి, జీవుని అందు ప్రవేశింపజేసినాడు. ఇది అనితర సాధ్యము అనిపిస్తుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!